టీడీపీ మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-27T02:57:37+05:30 IST

జిల్లాలోని కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ(83) కన్నుమూశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత

అనంతపురం: జిల్లాలోని  కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ(83) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శారదాంబ మృతి చెందారు. గతంలో టీడీపీ తరపున  ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె మృతికి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు తమ సంతాపాన్ని  ప్రకటించారు.

Updated Date - 2021-01-27T02:57:37+05:30 IST