టీడీపీ మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత
ABN , First Publish Date - 2021-01-27T02:57:37+05:30 IST
జిల్లాలోని కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ(83) కన్నుమూశారు.
అనంతపురం: జిల్లాలోని కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ(83) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శారదాంబ మృతి చెందారు. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె మృతికి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు తమ సంతాపాన్ని ప్రకటించారు.