అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-17T06:26:44+05:30 IST

పట్టణంలోని గూడ్స్‌షెడ్‌కొట్టాలకు చెందిన చేనేత కార్మికుడు గోగుల రంగయ్య (40) అప్పుల బాధ తాళలేక శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు.

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

ధర్మవరంఅర్బన్‌, జనవరి 16: పట్టణంలోని గూడ్స్‌షెడ్‌కొట్టాలకు చెందిన చేనేత కార్మికుడు గోగుల రంగయ్య (40) అప్పుల బాధ తాళలేక శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు తెలిపిన మేరకు... రంగ య్య, తన  భార్య ఉమాదేవితోకలిసి కూలి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పో షించుకునేవాడు. లాక్‌డౌన్‌ సమయం లో నేసిన చీరలకు గిట్టుబాటు ధఽరలు లబించక పోవడంతోపాటు కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. దాదాపు రూ.5లక్షల వరకు అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలంటూ తరచూ తీవ్ర మనోవేదనకు గురయ్యే వాడు. ఈక్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంటిలో అందరు నిద్రిస్తుండగా పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. శని వారం ఉదయం భార్యఉమాదేవి లేచి చూసేసరికి భర్త ఉరికివేలాడు ఉండటంతో ఒక్కసారిగా ఆమె బోరున విల పించింది. సా ్థనికుల సహాయంతో  ప్రభుత్వాస్పత్రికి తర లించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడికి కుమార్తె రక్షిత ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ప్రేమ విఫలమై యువకుడు..

అనంతపురం క్రైం, జనవరి 16: నగరంలో ఓ యువకుడు ప్రేమ విఫలమవటంతో మనస్తాపం చెంది, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. నగర శివారులోని మాయావతి కాలనీకి చెందిన రమావత్‌ విజయకుమార్‌నాయక్‌ (19) నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి నగరంలోని ఓ ప్రైవేట్‌ మార్ట్‌లో పనిచేస్తున్న యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే కొన్నిరోజుల కిందట ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయం చేశారు. ఆమె కూడా తల్లిదండ్రులు చెప్పిన విధంగా వివాహం చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు.  తల్లిదండ్రు లు రోజు వారీగానే శనివారం పనులకు వెళ్లగా... ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. నాలుగో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


తాడిపత్రిలో మరొకరు..

తాడిపత్రి టౌన్‌, జనవరి 16: పట్టణంలోని కృష్ణాపురం 5వ రోడ్డుకు చెందిన ఉద య్‌కుమార్‌రెడ్డి (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు డిగ్రీ మధ్యలో చ దువు ఆపేసి, ఖాళీగా ఉండేవాడు. కొంతకాలంపాటు అలా ఉండటతో జీవితంపై విరక్తిచెంది, శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, మ రణించాడు. తండ్రి రాజారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చే స్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ఓబులేసు తెలిపారు.

Updated Date - 2021-01-17T06:26:44+05:30 IST