పంజాబ్ మాజీ ముఖ్యమంత్రికి కరోనా

ABN , First Publish Date - 2022-01-19T21:49:13+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ (94) కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో కరోనా..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రికి కరోనా

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ (94) కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. లూథియానాలోని హీరో హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (డీఎంసీహెచ్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. పంజాబ్‌లో ఒమైక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ, రాజధాని చండీగఢ్, పొరుగు రాష్ట్రమైన హర్యానాలో కరనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు కోవిడ్ నిబంధనలు, ఈసీ గైడ్స్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రచారం సాగించాల్సి వస్తోంది. ఇటీవల ప్రకాష్ సింగ్ బాదల్ సైతం తన నియోజవర్గమైన లంబిలో పర్యటించి, పార్టీ నేతలతో పాటు ప్రజానీకాన్ని కలుసుకున్నట్టు చెబుతున్నారు.



Updated Date - 2022-01-19T21:49:13+05:30 IST