ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ABN , First Publish Date - 2021-10-14T00:45:46+05:30 IST
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.