హైకోర్టులో కౌలు పిటిషన్

ABN , First Publish Date - 2021-10-08T21:13:07+05:30 IST

కొంతమంది రాజధాని రైతులకు కౌలు రాకపోవడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది

హైకోర్టులో కౌలు పిటిషన్

అమరావతి: కొంతమంది రాజధాని రైతులకు కౌలు రాకపోవడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది వి.వి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నాలుగు వారాల్లోగా రైతులందరికీ కౌలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కౌలు విడుదలకు సంబంధించి జీవో జారీ చేశామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జీవో జారీ చేసినా కౌలు చెల్లించలేదని రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. 4 వారాల్లోగా కౌలు చెల్లించి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-10-08T21:13:07+05:30 IST