కరోనా వైరస్‌తో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి

ABN , First Publish Date - 2020-06-02T23:55:52+05:30 IST

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని

కరోనా వైరస్‌తో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. షేక్ మృతికి సంతాపం తెలియజేసిన లతీఫ్.. తన ఆత్మ శాంతి కలగాలని అందరూ ప్రార్ధించాలని కోరారు. 1987 నుంచి 2005 వరకూ తన కెరీర్‌లో షేక్.. 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆయన మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో ప్రధాన కోచ్‌గా చేరారు. షేక్ కంటే ముందు మరో పాకిస్థాన్ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్‌ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలలో ఆయన మృతి చెందారు. 

Updated Date - 2020-06-02T23:55:52+05:30 IST