ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-05-18T19:23:31+05:30 IST

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు.

ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణలేదన్నారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరగబోతున్న “ గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.



Updated Date - 2021-05-18T19:23:31+05:30 IST