మ్యాచ్‌ఫిక్సింగ్‌లా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వ్యవహారం: Ponnam

ABN , First Publish Date - 2022-02-22T19:54:04+05:30 IST

బీజేపీ, టీఆర్ఎస్‌ల వ్యవహారం మ్యాచ్ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని జీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

మ్యాచ్‌ఫిక్సింగ్‌లా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వ్యవహారం: Ponnam

సూర్యాపేట: బీజేపీ, టీఆర్ఎస్‌ల వ్యవహారం మ్యాచ్ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు చేయడం అసంభవమన్నారు.  మూతబడే స్థితిలో ఉన్న బీజేపీకి కేసీఆర్ జీవం పోస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను బీజేపీ అమ్ముతోందని మండిపడ్డారు. మతపరమైన అంశాలను లేవనెత్తి ఓట్లు దండుకునేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణా సెంటిమెంట్‌ను అగౌరవపరిచే ప్రధానిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నిలదీయడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Updated Date - 2022-02-22T19:54:04+05:30 IST