డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా భేటీ
ABN , First Publish Date - 2021-06-04T00:55:05+05:30 IST
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ
హైదరాబాద్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. గండిపేటలోని అరుణ ఫామ్హౌస్లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో వారు ఇరువురు చర్చించారు. ఉద్యమకారులు, కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని డీకే అరుణ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉద్యమకారులతో వరుస భేటీలు నిర్వహించాలని డీకే అరుణ యోచిస్తున్నారు.