వైసీపీ పాలనలో దళితులపై వివక్ష: Harsha kumar

ABN , First Publish Date - 2021-12-11T16:29:23+05:30 IST

వైసీపీ పాలనలో దళితులపై వివక్షత కొనసాగుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

వైసీపీ పాలనలో దళితులపై వివక్ష: Harsha kumar

రాజమండ్రి: వైసీపీ పాలనలో దళితులపై వివక్షత కొనసాగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఒంగోలుకు చెందిన దళితుడైన వినోద్ కుమార్‌ను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను దళితులు ప్రేమ వివాహం చేసుకోకూడదన్న భావంతో ముఖ్యమంత్రి జగన్ కులాంతర వివాహ ప్రోత్సాహకం నిలిపివేశారన్నారు. వైసీపీ హాయాంలో దళితులను హత్య చేస్తున్నా ప్రభుత్వం న్యాయం చేయటం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీలో ఉన్న దళితులంతా సమావేశమయ్యి దళితులపై జరుగుతున్న వివక్షపై ముఖ్యమంత్రిని నిలదీయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుని వైసీపీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించటం సిగ్గుచేటన్నారు. డెంగ్యూతో చిన్నారులు మృతి చెందటం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ డెంగ్యూపై దృష్టి సారించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-11T16:29:23+05:30 IST