ఆంధ్రా యూనివర్శిటీ మసకబారుతోంది: Harsha kumar

ABN , First Publish Date - 2022-02-28T16:45:19+05:30 IST

ఆంధ్రాయూనివర్శిటీ మసకబారుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

ఆంధ్రా యూనివర్శిటీ మసకబారుతోంది: Harsha kumar

రాజమండ్రి: ఆంధ్రాయూనివర్శిటీ మసకబారుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. స్వయంప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్స్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారికే యూనివర్శిటీల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆంధ్రాయూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డి... రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రోత్సాహించేలా మాట్లాడం దుర్మార్గమమని ఆయన మండిపడ్డారు.


పదవీవిరమణ చేసిన వ్యక్తిని ఆంధ్రాయూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా నియమించటం చాలా అన్యాయమన్నారు. రెగ్యులర్ ప్రొపెషర్స్ కూడ లేని పరిస్థితులు ఆంధ్రాయూనివర్శిటీలో ఉన్నాయని అన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం మార్చి 3న ‘‘ఛలో ఆంధ్రాయూనివర్శిటీ’’ చేపడుతున్నామని తెలిపారు. వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తోందని... జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుందన్నారు. అలాగే టీడీపీ కూడా బీజేపీకి అనుకూలమని అన్నారు. కానీ.... కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. 


Updated Date - 2022-02-28T16:45:19+05:30 IST