చంద్రబాబు సవాల్‌ను జగన్‌ స్వీకరించాలి

ABN , First Publish Date - 2020-08-09T11:09:07+05:30 IST

ఎన్నికల ముందు రాజధాని అమరా వతికి జై కొట్టి రాష్ట్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంతనూతలపాడు ..

చంద్రబాబు సవాల్‌ను జగన్‌ స్వీకరించాలి

 మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌


ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల ముందు రాజధాని అమరా వతికి జై కొట్టి రాష్ట్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌.విజయకుమార్‌ శని వారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాట తప్పం.. మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు రాజధాని విష యంలో మాటతో పాటు మడమ తిప్పారని ఆరోపించారు. ఇంతటి ప్రాధాన్య త కలిగిన ప్రధాన అంశానికి ప్రజామోదం కచ్చితంగా ఉండాలని స్పష్టం చే శారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించి ఆమోదం పొందాలని డిమాండ్‌ చేశారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన రాజీనామా సవాల్‌ ను స్వీకరించి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-09T11:09:07+05:30 IST