ఇదే పంధా కొనసాగితే ప్రజా తిరిగుబాటు తప్పదు: GV
ABN , First Publish Date - 2022-02-11T13:52:31+05:30 IST
ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు: ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. పోలీసులతో ఎంత మంది గొంతు నొక్కుతారని ప్రశ్నించారు. ఇదే పంధా కొనసాగితే ప్రజా తిరిగుబాటు తప్పదని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.