ఆ ఇద్దరి రాసలీలలు త్వరలో బయటపెడతా: Gone prakash

ABN , First Publish Date - 2022-01-05T17:56:14+05:30 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇద్దరి రాసలీలలు త్వరలో బయటపెడతా: Gone prakash

పెద్దపల్లి: మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇస్తే తనను దళిత ద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ రాసలీలలు త్వరలో బయట పెడతానని తెలిపారు. రామగుండంలో ఇసుక, బూడిద, మాఫియాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు. ‘‘నేను దళిత వ్యతిరేకిని కాదు...నన్ను కొప్పుల ఈశ్వర్, అతని అనుచరులు బదనామ్ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రామగుండం కార్పొరేషన్ అవినీతి మయంగా మారిందని... రామగుండం మేయర్‌ను దించే వరకు పోరాటం చేస్తానని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు. 


Updated Date - 2022-01-05T17:56:14+05:30 IST