దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ సిగ్గుచేటు: Somireddy

ABN , First Publish Date - 2022-06-04T17:04:50+05:30 IST

భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని

దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ సిగ్గుచేటు: Somireddy

నెల్లూరు: భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య  విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) అన్నారు. అధికార దుర్వినియోగంతోనే బూడిద తొట్టిలు కూలిపోయాయని... 40మంది ప్రాణాలు నష్టపోయేదని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు 10 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఓడ రేవు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రక్కనే కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలు అని.. ఇప్పుడైతే టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-04T17:04:50+05:30 IST