మహానాడులో జరిగేవి చర్చలా.. క్యాబరేనా: perni nani

ABN , First Publish Date - 2022-05-28T18:07:42+05:30 IST

ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహానాడులో జరిగేవి చర్చలా.. క్యాబరేనా: perni nani

విజయవాడ: ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో జరిగేవి చర్చలా?...క్యాబరేనా అని అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.... మహానాడులో మహిళా నేతలతో జగన్‌ మోహన్‌ రెడ్డిని బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు మహానాడు నిర్వహించే అధికారం చంద్రబాబు కుటుంబానికి లేదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఫెయిల్ అయినందునే బస్సు యాత్ర చేస్తున్నామనడం కరెక్ట్‌ కాదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఇప్పట్లో ఆగేది కాదని.. అది నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.


కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని పవన్‌ పార్టీ, చంద్రబాబు డిమాండ్‌ చేయలేదా అని ప్రశ్నించారు. వంగవీటీ మోహన రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు. ఆయా అంశాలపై కూడా అవసరమైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు ఇంటి ముందు పోస్టర్లు వేసుకోవడం సమంజసం కాదని... రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు వారికీ తెలుసని పేర్నినాని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-28T18:07:42+05:30 IST