చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల ఈటల తీవ్ర దిగ్బ్రాంతి

ABN , First Publish Date - 2021-05-06T16:39:11+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు...

చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల ఈటల తీవ్ర దిగ్బ్రాంతి

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. అజిత్ సింగ్‎ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఈటల అన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ఆయన కుటుంబ సభ్యులకు ఈటల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - 2021-05-06T16:39:11+05:30 IST