ఏపీ పరిస్థితులపై కేటీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలు: రవీంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-04-30T18:10:01+05:30 IST

ఏపీలో పరిస్ధితులపై తెలంగాణ మంత్రి కేటిఆర్ చెప్పినవన్నీ ముమ్మాటికి వాస్తవాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.

ఏపీ పరిస్థితులపై కేటీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలు: రవీంద్రారెడ్డి

కడప: ఏపీలో పరిస్ధితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పినవన్నీ ముమ్మాటికి వాస్తవాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రస్తుత చంచా మంత్రులకు వాస్తవాలు రుచించక రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో తీవ్రమైన విద్యుత్ కొరత, అధ్వాన్నమైన రోడ్లు, నీటి కొరత, అన్నీ సమస్యలుండేది ప్రజలకు తెలుసన్నారు. విద్యుత్‌పై సీఎం జగన్‌కు విద్యుత్ శాఖ మంత్రికి ఇరువురికి అవగాహన లేదని తెలిపారు. ఇష్టానుసారంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు, పనులు చేసే కాంట్రాక్టర్లకు నమ్మకాలు లేవన్నారు. ‘‘నువ్వేదో వెలగపెడతావని ప్రజలు నీకు 150 సీట్లు 53% ఓట్లు ఇచ్చారు’’ అంటూ రవీంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-04-30T18:10:01+05:30 IST