ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హేమంత్ కుటుంబానికి దేవినేని ఉమా పరామర్శ

ABN , First Publish Date - 2022-02-25T17:28:21+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మాదు హేమంత్ కుటుంబాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హేమంత్ కుటుంబానికి దేవినేని ఉమా పరామర్శ

విజయవాడ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మాదు హేమంత్ కుటుంబాన్ని  మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులతో హేమంత్‌ను మాజీ మంత్రి మాట్లాడించారు. ధైర్యంగా ఉండాలని హేమంత్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎంపీ కేశినేని నాని, ఇతర తెలుగుదేశం నాయకుల ద్వారా విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా లేఖలు వ్రాస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు.

Updated Date - 2022-02-25T17:28:21+05:30 IST