జగనన్న రాళ్ల పథకం ఎవరికోసం?: దేవినేని
ABN , First Publish Date - 2020-11-22T08:37:36+05:30 IST
‘జగనన్న రాళ్ల పథకం ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పండి’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విటర్లో ప్రభుత్వాన్ని నిలదీశారు.
జి.కొండూరు, నవంబరు 21: ‘జగనన్న రాళ్ల పథకం ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పండి’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విటర్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘భూముల సర్వే కోసం ఒక్కొక్క రాయి ఖరీదు రూ.5,500?.. 5 నెలలుగా వృద్ధాప్య పింఛను పెంపు ఎగ్గొట్టారు. సకాలంలో అందని జీతాలు, పింఛన్లు. రైతు పండించిన పంటను కోనే నాఽథు డే లేడు. రంగులకు రాళ్లకు మాత్రం వేల కోట్లు ఖర్చు’’ అని ట్వీట్ చేశా రు. ‘‘మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. మళ్లీ బూతులు మాట్లాడితే వాతలు పెడతాం. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చడంలో బ్రోకర్గా మారారు’’ అని మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. ఇక, హిందూ సంప్రదాయాల పట్ల జగన్రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ప్రసాద్ ఆరోపించారు. తుంగభద్ర పుష్కరాల్లో అరకొర వసతులతో భక్తులను విస్మరించారని విమర్శించారు.