సాయిరెడ్డి అండతో భూఆక్రమణ: బండారు

ABN , First Publish Date - 2020-11-22T08:37:06+05:30 IST

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండతో ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి పెందుర్తి మండలంలో కొందరు రైతులకు చెందిన భూమి,

సాయిరెడ్డి అండతో భూఆక్రమణ: బండారు

విశాఖపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండతో ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి పెందుర్తి మండలంలో కొందరు రైతులకు చెందిన భూమి, కాలువ ఆక్రమణకు యత్నించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పెందుర్తి మండలం గొరపల్లి రెవెన్యూ పరిధిలోని జామివాని చెరువు కింద ఆయకట్టులోని 4.95 ఎకరాల్లో 4.55 ఎకరాలను తన పేరిట రిజిస్టర్‌ చేయించుకోవడానికి సూర్యప్రకాశ్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే అదీ్‌పరాజు అండ ఉందన్నారు. లింకు డాక్యుమెంట్లు లేకుండా జీపీఏ రిజిస్టర్‌ చేయకూడదని తెలిసినా సాయిరెడ్డి ఒత్తిడికి కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ తలొగ్గారన్నారు. పెందుర్తి తహశీల్దార్‌ కూడా నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఆన్‌లైన్‌ చేశారన్నారు.

Updated Date - 2020-11-22T08:37:06+05:30 IST