గ్రేటర్ ప్రచారంలో ఏపీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-25T22:34:39+05:30 IST

ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో

గ్రేటర్ ప్రచారంలో ఏపీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశముందని జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌ను గ్రేట్‌గా మార్చగలిగేది బీజేపీనేనని తెలిపారు. బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీ, రాయలసీమ ప్రజలంతా బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చే నోట్లను తీసుకుని ఓటర్లు బీజేపీకి ఓటు వేయాలని ఆదినారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-11-25T22:34:39+05:30 IST