బీజేపీ నేతలను వేటకుక్కలతో పోల్చిన Siddaramaiah

ABN , First Publish Date - 2022-06-10T02:53:05+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలను

బీజేపీ నేతలను వేటకుక్కలతో పోల్చిన Siddaramaiah

బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలను కుక్కలతో పోల్చారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు 25 మంది బీజేపీ నేతలు తనపై వేటకుక్కల్లా మొరగడం ప్రారంభిస్తారని సిద్ధరామయ్య అన్నారు.  కానీ వారు మొరిగినప్పుడు మాత్రం తాను మాత్రమే మాట్లాడతానని, తమ పార్టీవారు ఎవరూ మాట్లాడరని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య అన్నారు. ‘‘మా కార్యాలయం నుంచి ఎవరూ మాట్లాడరు. అందుకే మా కార్యాలయం నుంచి పుస్తకాలు పంచిపెట్టాం’’ అని సిద్ధూ అన్నారు.  


రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల కాషాయీకరణ జరుగుతోందని ఆరోపిస్తూ విధాన సభ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అందులో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలను సవరించిన రోహిత్ చక్రతీర్థ సనాతన ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే భావిస్తున్నానని, లేదంటే వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహిస్తామని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   

Updated Date - 2022-06-10T02:53:05+05:30 IST