ప్రజల మనిషి ప్రజల నుండి దూరమవడం బాధాకరం: Vidyasagar
ABN , First Publish Date - 2021-12-04T16:15:29+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల మనిషి ప్రజల నుండి దూరమవడం చాలా బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో ఇరువురు చాలా కాలం కలిసి పని చేసిన రోజులను సీహెచ్ గుర్తు చేసుకున్నారు. శాసనసభలో తమ మధ్యన జరిగిన చర్చలలో ఎన్నో సందర్భాలలో నవ్వులు పూయించిన సందర్భాలున్నాయని...ఇది ఎన్నటికీ మరువలేనని తెలిపారు. రోశయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ...కుటుంబసభ్యులకు విద్యాసాగర్రావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.