ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు కరోనాతో మృతి

ABN , First Publish Date - 2020-06-06T18:24:57+05:30 IST

ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు హంసకోయ (61) శనివారం కరోనా వైరస్‌తో మరణించారు.....

ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు కరోనాతో మృతి

మలప్పురం (కేరళ): ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు హంసకోయ (61) శనివారం కరోనా వైరస్‌తో మరణించారు. మహారాష్ట్ర తరపున సంతోష్ ట్రోఫీ ఆడిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు సంతోష్ కోయ మే 21 వతేదీన ముంబై నుంచి కేరళ రాష్ట్రంలోని మలప్పురానికి తిరిగివచ్చారు. దీర్ఘకాల నిమోనియా వ్యాధితో బాధపడుతున్న హంసకోయ ఊపిరితిత్తుల సమస్యతో మంజేరీ వైద్యకళాశాలలో చేరారు. హంసకోయకు కరోనా సోకడంతో అతనికి మందులతో చికిత్స చేసినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఇతనికి ప్లాస్మా థెరపీ చేయాలని వైద్యులు సలహా ఇచ్చారు. అంతలో శనివారం ఉదయం హంసకోయ తుదిశ్వాస విడిచారు. కరోనాతో మరణించిన క్రీడాకారుడి భార్య, కుమారుడు, కోడలు, మూడేళ్ల వయసు గల బాబు, మరో 3 నెలల చిన్నారికి కూడా కరోనా సోకడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. క్రీడాకారుడి మృతితో శనివారం కేరళ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 15కు పెరిగింది. 


Updated Date - 2020-06-06T18:24:57+05:30 IST