మాజీ ఫుట్‌బాలర్‌ ఆనంద్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-11T09:01:17+05:30 IST

ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు డి. ఆనంద్‌ (60) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. సంతోష్‌ ట్రోఫీ, డ్యూరాండ్‌ కప్‌లాంటి ప్రతిష్ఠాత్మక జాతీయ టోర్నీల్లో పాల్గొన్న ఆనంద్‌.. ఇటీవలే స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు...

మాజీ ఫుట్‌బాలర్‌ ఆనంద్‌ కన్నుమూత

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు డి. ఆనంద్‌ (60) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. సంతోష్‌ ట్రోఫీ, డ్యూరాండ్‌ కప్‌లాంటి ప్రతిష్ఠాత్మక జాతీయ టోర్నీల్లో పాల్గొన్న ఆనంద్‌.. ఇటీవలే స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆనంద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొసరాజు గోపాలకృష్ణ, అత్తిలి జగన్నాథరావు, ఇతర ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-04-11T09:01:17+05:30 IST