దినమలర్‌ మాజీ ఎడిటర్‌ కృష్ణమూర్తి మృతి

ABN , First Publish Date - 2021-03-05T11:43:55+05:30 IST

ప్రఖ్యాత తమిళ దినపత్రిక దినమలర్‌ మాజీ ఎడిటర్‌, పురాతన నాణేల సేకరణకర్త ఆర్‌.కృష్ణమూర్తి ఇక లేరు. గురువారం ఆయన గుండెపోటుతో మరణించినట్టు ఆ పత్రిక ఎడిటర్‌ కె.రామసుబ్బు తెలిపారు

దినమలర్‌ మాజీ ఎడిటర్‌ కృష్ణమూర్తి మృతి

చెన్నై, మార్చి 4: ప్రఖ్యాత తమిళ దినపత్రిక దినమలర్‌ మాజీ ఎడిటర్‌, పురాతన నాణేల సేకరణకర్త ఆర్‌.కృష్ణమూర్తి ఇక లేరు. గురువారం ఆయన గుండెపోటుతో మరణించినట్టు ఆ పత్రిక ఎడిటర్‌ కె.రామసుబ్బు తెలిపారు. 88 ఏళ్ల కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ‘ఆర్‌కే’గా సుపరిచితులైన కృష్ణమూర్తి 1956లో దినమలర్‌ పత్రికలో చేరి 1977లో ఆ పత్రికకు ఎడిటర్‌ అయ్యారు. ఆయన మృతి పట్ల తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2021-03-05T11:43:55+05:30 IST