Tamilnadu: గుండెపోటుతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజా మృతి
ABN , First Publish Date - 2021-10-02T16:20:22+05:30 IST
తమిళనాడు డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు...
చెన్నై: తమిళనాడు డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.డీఎంకే బలమైన నాయకుడైన ఆరుముగం కుమారుడైన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వీరపాండి రాజా గాంధీ జయంతి రోజు కన్నుమూశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ త్యాగరాజన్లు నివాళులర్పించారు.వీరపాండీ రాజా మృతి పట్ల పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు.