గుండెపోటుతో కౌలు రైతు మృతి
ABN , First Publish Date - 2020-11-24T06:16:39+05:30 IST
మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన పెద్దమస్తాన్ (47) అనే కౌలు రైతు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.
దొర్నిపాడు, నవంబరు 23: మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన పెద్దమస్తాన్ (47) అనే కౌలు రైతు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. పెద్దమస్తాన్ తనకున్న 2 ఎకరాల పొలంతో పాటు మరో 4 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని సాగుచేస్తుండేవాడు. గత ఏడాది, ఈ ఏడాది వర్షాలు అధికం కావడంతో పంటలు దెబ్బతిని నష్టానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై మానసికంగా కుమిలిపోయేవాడు. సోమవారం పనులకు వెళ్తుండగా గుండెలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో భార్య, పిల్లల రోదనలు పలువురి కంటతడి పెట్టించింది. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.