టీటీడీ, ప్రభుత్వంపై మాజీ సీఎస్ విమర్శలు

ABN , First Publish Date - 2020-10-17T16:34:11+05:30 IST

టీటీడీ, ప్రభుత్వంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

టీటీడీ, ప్రభుత్వంపై మాజీ సీఎస్ విమర్శలు

తిరుమల: టీటీడీ, ప్రభుత్వంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీవారి నిధుల మళ్లింపు వ్యవహారంపై  ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘శ్రీవారి నిధులు మళ్ళీంపుపై టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుంది... శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో పెట్టే దానికి టీటీడీకి అర్హత ఉందా...? ప్రభుత్వ ఒత్తిడి మేరకే టీటీడీ శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో ప్రభుత్వానికి మళ్లిస్తాఉంది... ఇది అధికార దుర్వినియోగం’’ అంటూ కృష్ణారవు ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-17T16:34:11+05:30 IST