Former CM: మోదీ ఇమేజ్‌తో 140 స్థానాలు ఖాయం

ABN , First Publish Date - 2022-09-04T17:25:21+05:30 IST

రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇమేజ్‌ తోడై బీజేపీకి 140కుపైగా స్థానాలు ఖాయమని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌

Former CM: మోదీ ఇమేజ్‌తో 140 స్థానాలు ఖాయం

                                         - మాజీ సీఎం యడియూరప్ప


 బెంగళూరు: రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇమేజ్‌ తోడై బీజేపీకి 140కుపైగా స్థానాలు ఖాయమని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) పేర్కొన్నారు. శివమొగ్గలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని ప్రధాని తనకు సూచన చేశారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిపారు. పాదయాత్ర చేయాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ప్రధాని మోదీ తదుపరి సమావేశం శివమొగ్గలో ఉంటుందన్నారు. కాంగ్రెస్(Congress)కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ముద్దహనుమేగౌడ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని, ఇదే బాటలో పలువురు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఉన్నారని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామన్నారు. 

Updated Date - 2022-09-04T17:25:21+05:30 IST