రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2021-12-04T19:40:41+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల సంతాపం తెలిపారు.

రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల సంతాపం తెలిపారు. రోశయ్య మృతికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, సుజనాచౌదరి, కేవీపీ, రేవంత్‌రెడ్డి, రఘురామ, చిరంజీవి, మోహన్‌బాబు, అంబికా కుటుంబసభ్యులు, ఏపీ మంత్రులు ఆళ్లనాని, ఆదిమూలపు సురేష్, బొత్స, తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, సబిత, టీఆర్ఎస్ నేత  కవిత, గల్లా జయదేవ్, గల్లా అరుణ, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రులు అచ్చన్న, యనమల, గంటా, ఆలపాటి, మాజీమంత్రి సోమిరెడ్డి, చింతామోహన్, రఘువీరారెడ్డి, ప్రత్తిపాటి, బండారు సత్యనారాయణ, కాంగ్రెస్ నేత సుధాకర్, యడ్లపాటి వెంకట్రావు, పయ్యావుల కేశవ్, అనంత వెంకట్రామిరెడ్డి, షర్మిల, మల్లు రవి, వీహెచ్, జీవన్‌రెడ్డి, తుమ్మల, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, ఎంపీ డీఎస్, డీకే అరుణ, గంగా భవాని, ఇంద్రకరణ్‌రెడ్డి, గిడుగు రుద్రరాజు, కొండా రాఘవరెడ్డి, ఆల్ ఇండియన్ వైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-04T19:40:41+05:30 IST