రోశయ్య పార్థివదేహానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ నివాళి

ABN , First Publish Date - 2021-12-04T19:14:25+05:30 IST

మాజీ సీఎం‌ రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు.

రోశయ్య పార్థివదేహానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ నివాళి

హైదరాబాద్: మాజీ సీఎం‌ రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ... రోశయ్య వాగ్థాటిని తట్టుకోలేక ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారన్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేది రోశయ్యను చూసి నేర్చుకున్నామని తెలిపారు. ఏ పదవి చేసినా.. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. 

Updated Date - 2021-12-04T19:14:25+05:30 IST