వెంటిలేటర్లపై మాత్రం రాజకీయం వద్దు : ఫడ్నవీస్

ABN , First Publish Date - 2021-05-17T23:31:17+05:30 IST

పీఎం కేర్స్ నుంచి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు వచ్చాయని, వాటి పంపిణీలో ఎలాంటి రాజకీయాలు

వెంటిలేటర్లపై మాత్రం రాజకీయం వద్దు : ఫడ్నవీస్

ముంబై : పీఎం కేర్స్ నుంచి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు వచ్చాయని, వాటి పంపిణీలో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. ‘‘పీఎం కేర్స్ ఫండ్ కింద మహారాష్ట్రకు 5,000 వెంటిలేటర్లు వచ్చాయి. వాటిలో చాలా వరకూ నాలుగు నెలల పాటు అందుబాటులోకి రాలేదు. అందుకే లోపాలను సరిచేసి, వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి. ఈ అంశం రాజకీయం చేసే అంశం ఎంతమాత్రం కాదు’’ అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. లాతూర్, ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని, అయితే పాజిటివిటీ రేటు మాత్రం అధికంగానే ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-17T23:31:17+05:30 IST