Chief Minister: లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు

ABN , First Publish Date - 2022-09-24T14:35:42+05:30 IST

లోక్‌సభకు, శాసనసభకు 2024లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయని, ఆ ఎన్నికల్లో అధికార డీఎంకే తుడిచిపెట్టుకుపోయి తమ పార్టీ మళ్ళీ

Chief Minister: లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు

- 2024లో జమిలీ ఎన్నికలు

- మళ్లీ ప్రభుత్వం మాదే

- ఈపీఎస్‌ జోస్యం


చెన్నై, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభకు, శాసనసభకు 2024లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయని, ఆ ఎన్నికల్లో అధికార డీఎంకే తుడిచిపెట్టుకుపోయి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi palaniswami)) జోస్యం చెప్పారు. శుక్రవారం సేలం జిల్లా ఆట్టయాంబట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో తన సొంత జిల్లా సేలంలో 11నియోజకవర్గాల్లో గెలిచి అన్నాడీఎంకే కంచుకోటగా మారిందన్నారు. రాష్ట్రంలో మరో నాలుగేళ్లపాటు డీఎంకే పాలన కొనసాగితే ప్రజలకు కష్టాలే మిగులుతాయని, అంతే కాకుండా 2024లో లోక్‌సభ, శాసనసభకు ఒకే సారి ఎన్నికల జరుగటం ఖాయమని, ఆ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఈపీఎస్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-24T14:35:42+05:30 IST