ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన మాజీ సీఎం

ABN , First Publish Date - 2020-08-13T22:24:35+05:30 IST

ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏవీ లేవని ఆసుపత్రి నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో వైద్యులు పేర్కొన్నారు

ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన మాజీ సీఎం

బెంగళూరు: కార్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులుగా కోవిడ్-19 చికిత్స తీసుకున్న ఆయన బుధవారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. అయితే గురువారం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు ముందుగానే ప్రకటించారు. దాని ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి బయల్దేరారు.


ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏవీ లేవని ఆసుపత్రి నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో వైద్యులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొద్ది రోజుల పాటు ఆయన హోం క్వారంటైన్‌లో ఉండాలని దానితో పాటు కొన్ని సూచనలు పాటించాలని సిద్ధారమయ్యకు సూచించినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-08-13T22:24:35+05:30 IST