యానాంలో మాజీ సీఎంకి తప్పని ఓటమి

ABN , First Publish Date - 2021-05-03T03:08:24+05:30 IST

స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ 656 ఓట్లతో విజయం సాధించారు

యానాంలో మాజీ సీఎంకి తప్పని ఓటమి
N R Rangasamy

యానాం: ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, పుదుచ్చేరి మాజీ సీఎం ఎన్.రంగస్వామికి యానాంలో ఓటమి తప్పలేదు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ 656 ఓట్లతో విజయం సాధించారు. రంగస్వామికి 16,477 ఓట్లు, శ్రీనివాస్‌కు 17,132 ఓట్లు వచ్చాయి. మొత్తం 15వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాగా, రంగస్వామి తమిళనాడులోని తట్టాన్‌చావడి నుంచి కూడా శాసనసభకు పోటీ చేసి తన సమీప అభ్యర్థి కె.సేతుపై 5456 ఓట్లతో గెలిచారు. 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలో మేజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ-ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 15 స్థానాలు గెల్చుకుని అధికారపీఠానికి చేరువైంది.

Updated Date - 2021-05-03T03:08:24+05:30 IST