చంద్రబాబు భార్యపై విమర్శలు అత్యంత హీనం: Chinta
ABN , First Publish Date - 2021-11-20T18:03:38+05:30 IST
అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్యపై విమర్శలు చేయడం అత్యంత హీనమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్యపై విమర్శలు చేయడం అత్యంత హీనమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలో వేరొకరి భార్యపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ విమర్శతో వైసీపీ విలువలు పాతాళానికి పోయాయని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ బిసి, మైనార్టీలకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చింతా మోహన్ అన్నారు.