సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-30T22:18:41+05:30 IST
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమరాడ మండలం దళాయిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పార్వతీపురం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమరాడ మండలం దళాయిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోకూడదని హితవు పలికారు. వేల రూపాయిలతో ఓటు కొనుగోలు చేయటానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటనే ఆయుధంతో ప్రజలు రాజులు కావాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు..