ధోనీ ఆశలు ఆవిరైనట్టే: హర్షాభోగ్లే
ABN , First Publish Date - 2020-03-29T09:58:28+05:30 IST
ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులోకి వద్దామనుకున్న మాజీ కెప్టెన్ ధోనీ ఆశలు ఆవిరైనట్టేనని ప్రఖ్యాత కామెంటేటర్ హర్షాభోగ్లే అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ ...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులోకి వద్దామనుకున్న మాజీ కెప్టెన్ ధోనీ ఆశలు ఆవిరైనట్టేనని ప్రఖ్యాత కామెంటేటర్ హర్షాభోగ్లే అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ జరగడం అనుమానమేననీ.. దీంతో ధోనీకి జాతీయ జట్టులోకి దారులు మూసుకుపోయినట్టేనని భోగ్లే అన్నాడు. ‘ధోనీ కెరీర్ ముగిసినట్టే. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్ దాకా అతను వేచి చూస్తాడనుకోవడం లేదు. ఐపీఎల్ జరిగుంటే అతని పరిస్థితి వేరేలా ఉండేది’ అని భోగ్లే చెప్పుకొచ్చాడు.