తరుణ్ గొగోయ్ పరిస్థితి విషమం.. ఐసీయూకి తరలింపు..

ABN , First Publish Date - 2020-09-25T18:28:46+05:30 IST

కొవిడ్-19 కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్...

తరుణ్ గొగోయ్ పరిస్థితి విషమం.. ఐసీయూకి తరలింపు..

గువాహటి: కొవిడ్-19 కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయనను గువాహటి మెడికల్ కాలేజ్ ఆస్పత్రి (జీఎంసీహెచ్)లోని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. 85 ఏళ్ల తరుణ్‌ గొగోయ్‌కి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గత నెల 25న గుర్తించగా.. ఆ మరుసటి రోజే జీఎంసీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం జీఎంసీహెచ్ పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జోగేశ్ శర్మ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం తరుణ గొగోయ్‌కి చికిత్స అందిస్తోంది. కాగా ఈ నెల మొదట్లో ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి ఆయన ఆరోగ్య విషమించడంతో ప్లాస్మా థెరపీ అందించారు. 2016లో అసోంలో బీజేపీ అధికారంలోకి రాకముందు తరుణ్‌ గొగోయ్ 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 

Updated Date - 2020-09-25T18:28:46+05:30 IST