నా తప్పులను మన్నించండి.. ఢిల్లీ ప్రజలను కోరిన మనోజ్ తివారీ
ABN , First Publish Date - 2020-06-03T01:58:33+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మనోజ్ తివారీ ఇన్నాళ్లూ కొనసాగారు. అయితే ఆయనను...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మనోజ్ తివారీ ఇన్నాళ్లూ కొనసాగారు. అయితే ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ జాతీయ కమిటీ నేడు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ‘నేను ఇన్నాళ్లలో ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అదేశ్ కుమార్ గుప్తాకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న 3.6 సంవత్సరాలలో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని మనోజ్ తివారీ పేర్కొన్నారు.