మంత్రి సంతకం ఫోర్జరీ...రెడ్డప్పపై కేసు
ABN , First Publish Date - 2020-02-14T15:03:05+05:30 IST
మంత్రి సంతకం ఫోర్జరీ...రెడ్డప్పపై కేసు
కడప: మంత్రి తేనేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డెప్పపై చిన్నమండెం మండల పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద ఉన్న 1.26 ప్రభత్వ భూమిని రెడ్డెప్పకు కేటాయించాలని మంత్రి వనిత లెటర్ హెడ్పై కలెక్టర్ హరికిరణ్కు ఫోర్జరీ సంతకంతో సిఫారసు లెటర్ను రెడ్డప్ప పంపించారు. విషయం తెలిసిన మంత్రి వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా రాయచోటి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఫోర్జరీ, మోసంపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి రెడ్డెప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.