విదేశీ విద్యార్థుల ఫేర్‌వెల్‌

ABN , First Publish Date - 2022-05-24T06:47:49+05:30 IST

ఏయూ అంతర్జాతీయ విద్యార్థుల ఫేర్‌వెల్‌ వేడుకలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి.

విదేశీ విద్యార్థుల ఫేర్‌వెల్‌
విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన

ఏయూ అంతర్జాతీయ విద్యార్థుల ఫేర్‌వెల్‌ వేడుకలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలో 49 దేశాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వెల్లడించారు.

-ఏయూ క్యాంపస్‌


ఠారెత్తించిన ఎండ

నగర వాసులు ఉక్కిరిబిక్కిరి

పెందుర్తిలో 42.9 డిగ్రీలు


విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో సోమవారం ఎండ మండిపోయింది. పడమర గాలులకు ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా వేడి వాతావరణం కొనసాగింది. ఎండకు ఉక్కపోత తోడు కావడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరుబయట పనులపై వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఇళ్లలో ఉన్న వారు కూడా ఎండ, ఉక్కపోతకు తాళలేకపోయారు.  నగరంతోపాటు పరిసరాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పెందుర్తిలో 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఎండలు మరో వారం వరకూ కొనసాగుతాయని వాతావరణశాఖ నిపుణుడొకరు హెచ్చరించారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడ దెబ్బ తగలకుండా ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు.


రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు 

లావేరు, మే 23: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక కూడలి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...విశాఖ వాంబే కాలనీకి చెందిన కె.వేణు (28), అతని భార్య తిలోత్తమ డ్యాన్సర్‌లు. వీరిద్దరూ సోమవారం రాత్రి శ్రీకాకుళంలో నిర్వహించనున్న డ్యాన్స్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదపాక కూడలి సమీపంలో వీరి ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢొకొంది. ఈ ప్రమాదంలో వేణు అక్కడిక్కడే మృతి చెందగా, తిలోత్తమ తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 వాహనం ద్వారా చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-05-24T06:47:49+05:30 IST