వృద్ధురాలి బలవన్మరణం

ABN , First Publish Date - 2021-06-23T07:44:29+05:30 IST

కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.

వృద్ధురాలి బలవన్మరణం
ముత్తమ్మ (ఫైల్‌ ఫొటో)

రామన్నపేట, జూన్‌ 22: కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.  రామన్నపేటలోని ఆర్టీసీ బస్‌ స్టేష న్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట పట్టణానికి చెందిన ముత్తమ్మ (80) ఏడాదిగా కడుపునొప్పితో బాధ పడుతోంది. ముత్తమ్మ భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందగా; కూరగాయల వ్యాపారం చేస్తున్న  కుమారుడు మల్లేశం వద్దే ఉంటుంది. కడుపునొప్పితో జీవితంపై విరక్తి చెంది . భువనగిరికి  వెళ్లడానికి  బయలుదేరిన  బస్సు వెనుక టైర్ల కింద తల పెట్టింది. దీంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. 




Updated Date - 2021-06-23T07:44:29+05:30 IST