మెట్‌పల్లి మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T06:07:18+05:30 IST

మెట్‌పల్లి మండలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పంచాయతీ రాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వినతి పత్రంను అందజేశారు.

మెట్‌పల్లి మండల అభివృద్ధికి   నిధులు మంజూరు చేయాలి
మంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే

మెట్‌పల్లి రూరల్‌, మే 23 : మెట్‌పల్లి మండలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పంచాయతీ రాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వినతి పత్రంను అందజేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంకు వెళ్లి మండలంలోని కోండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల వాగుపై, పెద్దాపూర్‌, రామారావుపల్లె గ్రామాల మధ్య ఉన్న వాగులపై బ్రిడ్జిల నిర్మాణంకు పలు గ్రామాల మధ్య లింక్‌ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటుకు అదే విధంగా పెడ్డింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరినట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్‌ తెలిపారు. దీంతో మంత్రి సానుకులంగానే స్పందించినట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2022-05-24T06:07:18+05:30 IST