పనబాకను గెలిపించాలని టీడీపీ ఇంటింటా ప్రచారం
ABN , First Publish Date - 2021-04-13T05:18:11+05:30 IST
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం అన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల
నాయుడుపేట టౌన్ , ఏప్రిల్ 12 : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని జువ్వలపాళెంలో సోమవారం ఆయన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కరపత్రాలను అందజేసి పనబాక లక్ష్మిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, ఓజిలి మండలం టీడీపీ అధ్యక్షుడు విజయ్కుమార్నాయుడు, నాయకులు పసల గంగాప్రసాద్, బిరదవాడ నారాయణ, నానబాల సుబ్బరావు, రవి, సిరాజ్ పాల్గొన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించండి
ఫ మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి
పెళ్లకూరు, ఏప్రిల్ 12 : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు. సోమవారం ఆయన మండల టీడీపీ నాయకులతో కలసి చింతపూడి పంచాయతీలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, సంచి కృష్ణయ్య, డీ ప్రసాద్నాయుడు, మల్లు కృష్ణయ్య, హరిబాబు, దీనదయాళ్నాయుడు, వేణుంబాక రామానాయుడు, సర్పంచ్ కలవకోలు అమరావతి, తదితరులు పాల్గొన్నారు.