కండరాల పటుత్వం కోసం...

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

కండరాల పటుత్వం కోసం...

కండరాల పటుత్వం కోసం...

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో తెలుసుకుందాం!


ప్రసరిత పాదోత్తనాసనం

రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే....

వెన్ను సాగదీయబడుతుంది.

తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.

మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి.

ఈ ఆసనంతో నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.

మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.


అధోముఖ కపోతనాసనం

ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

తుంటి, తొడ ఎముకలు కలిసే కీలును బలపరుస్తుంది.

నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, పరిగెత్తే సమయంలో, నిలబడినప్పుడు శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.


విపరీతకారిణి

నేల మీద వెల్లకిలా పడుకుని, గోడ మీద కాళ్లు నిటారుగా చాపి ఉంచే ఈ ఆసనంతో ఒరిగే ప్రయోజనాలు ఇవి...

ఈ ఆసనం వేసే సమయంలో నడుము అడుగున దుప్పటి ఉండలా చుట్టి ఉంచుకుంటే, కాళ్ల వాపులు, అలసిపోయే కీళ్లు, భారంగా మారే తుంటి సమస్యలు తగ్గుతాయి.

ఈ ఆసనం వేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందులకు కారణమయ్యే లింఫ్‌, ఇతర స్రావాలు ఆయా శరీర భాగాల నుంచి పొత్తికడుపులోకి చేరతాయి. ఫలితంగా కాళ్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లోని ఇబ్బందులు తొలగుతాయి.

Read more