రాయితీ ఉల్లి కోసం..

ABN , First Publish Date - 2020-10-24T10:41:42+05:30 IST

: రైతుబజార్లలో రాయితీ ఉల్లి (కిలో రూ.40) అమ్మకాలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించారు.

రాయితీ ఉల్లి కోసం..

 రైతుబజార్లలోబారులుతీరిన జనం

 కిలో రూ.40 చొప్పున విక్రయాలు


విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతుబజార్లలో రాయితీ ఉల్లి (కిలో రూ.40) అమ్మకాలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించారు. ఒక్కొక్కరికి కిలో మాత్రమే ఇచ్చారు. పేరు, ఫోన్‌ నంబర్‌ రాసుకుంటున్నారు. రాయితీ ఉల్లి కొనుగోలుకు వినియోగదారులు బారులుతీరారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మకాలు జరిగాయి. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతుబజార్లలో సాయంత్రం కూడా విక్రయించారు. కొన్ని బజార్లలో 30 నుంచి 50 బస్తాల వరకు ఉల్లి మిగిలింది. వాటిని శనివారం ఉదయం రాయితీ ధరకు విక్రయిస్తారు.


శని, ఆదివారాల్లో రాయితీ ఉల్లి వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రెండు రోజులు డ్వాక్రా సంఘాలు అమ్మే రేటు (కిలో రూ.74)కు కొనుగోలు చేసుకోవలసి ఉంటుంది. దసరా మరుసటి రోజు అంటే సోమవారం నాటికి రాయితీ ఉల్లి వస్తుందని, అప్పుడు మళ్లీ రేటు తగ్గించి రాయితీపై విక్రయిస్తామని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో రూ.90-రూ.100 మధ్య విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-10-24T10:41:42+05:30 IST