ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-26T06:22:20+05:30 IST
కడియంలో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి.
కడియం, ఫిబ్రవరి 25: కడియంలో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఆర్టోస్ సంస్థల ఎండీ సంతోష్, డైరెక్టర్ ఏవీఎస్ గౌతమ్వర్మ, టీటైం సంస్థల సురేష్ తదితరులు ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ ఇన్విటేషన్ టోర్నమెంట్లో 35 జట్లు పాల్గొంటాయని, విన్న ర్కు ట్రోఫీతో పాటు రూ.10వేలు, రన్నర్స్కి ట్రోఫీతోపాటు రూ.5వేలు, 3వ విజేతకు ట్రోఫీ అందజేస్తారని తెలిపారు. నిర్వాహకులు వల్లి అనిల్కుమార్, వల్లి సునీల్కుమార్, ఎల్.వాసు, జి.శివ, ఆర్.శ్రీను, భవానీశంకర్ పాల్గొన్నారు.